Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో ఐదు వికెట్లు ఉన్నా.. కానీ 338 రన్స్ చేయలేని దుస్థితి... గంగూలీ విమర్శలు

Webdunia
సోమవారం, 1 జులై 2019 (16:48 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముగింట 337 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన కేవలం 306 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది. 
 
ఆ సమయంలో కామెంటేటర్స్ బాక్సులో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ల ఆసక్తికర సంభాషణ జరిగింది. అపుడు నాసిర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ, ధోనీ ఆటతీరు గురించి చెప్పడానికి తన వద్ద ఎలాంటి వివరణ లేదన్నారు. 
 
ముఖ్యంగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ 338 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్లు ఉన్నారంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా, ధోనీ సింగిల్స్ తీస్తూ అతి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ విమర్శలు గుప్పించారు. నిజానికి భారత క్రికెట్ జట్టు 300 పరుగులకు ఆలౌట్ అయివున్నా తాను బాధపడేవాడినని కాదని, కానీ ఐదు వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటం ఏంటని ధోనీ, కేదార్ జాదవ్ ఆటతీరును గంగూలీ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments