Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ : అహ్మదాబాద్‌లో డే అండ్ నైట్ టెస్ట్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (16:30 IST)
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు వచ్చే యేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ జట్లు నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం రిలీజ్ చేసింది. 
 
ఈ పర్యటన వచ్చే యేడాది ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి ప్రారంభంకానుంది. అయితే అహ్మ‌దాబాద్‌లో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన నుంచి రెండు జ‌ట్ల మ‌ధ్య డే అండ్ నైట్ టెస్టును నిర్వహించేలా ప్లాన్ చేశారు. 
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో టీమిండియా ఆడాల్సిన పలు క్రికెట్ సిరీస్‌లు వాయిదాపడిన విషయం తెల్సిందే. తొలుత మార్చిలో సౌతాఫ్రికా జ‌ట్టుతో జ‌ర‌గాల్సిన సిరీస్‌ను ర‌ద్దు చేశారు. ఆపై ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను దుబాయ్‌లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. 
 
అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ అంతర్జాతీయ పర్యటనలు పునఃప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగానే టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అలాగే, ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది. ఇంగ్లండ్‌తో జ‌రిగే డే అండ్ నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జ‌రుగుతుంద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments