Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిలైడ్ టెస్టులో బిగ్ బాస్.. అశ్విన్ పెర్త్‌కు దూరం..

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (10:52 IST)
భారత్-ఆస్ట్రేలియాలో జరుగనున్న పెర్త్ టెస్టుకు భారత స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు. దీంతో తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న టీమిండియాకు రెండో టెస్టులో చుక్కలు కనిపించే అవకాశం వుందని క్రీడా పండితులు అంటున్నారు. అడిలైడ్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టి బిగ్ బాస్‌గా నిలిచిన అశ్విన్.. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
గాయం కారణంగా అశ్విన్.. అలాగే స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మలు తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు ప్రారంభం కానుంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ తప్పుకోగా, వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఇక ఓపెనర్ పృథ్వీ షా చీలమండ గాయం నుంచి తేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ పెర్త్‌కు దూరమైనా.. హనుమ విహారి, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లతో 13 మంది సభ్యులతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. 
 
భారత జట్టు వివరాలు.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments