Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ జరుగుతుందా? గంగూలీ ఏమన్నాడు?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (18:05 IST)
భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌ ఎప్పుడు జరుగుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ సందిగ్ధంలో వున్నారు. ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అలాగే క్రీడా సంబంధాలు కూడా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో కాబోయే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై దాటవేశాడు. 
 
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను అడగాలన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు అంటే కచ్చితంగా ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి, దానికి సమాధానం మా దగ్గరలేదు.. అంటూ గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
కాగా.. టీమిండియా పాకిస్తాన్ మధ్య 2012లో చివరి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ ఈనెల 23న బాధ్యతలు చేపట్టనున్నారు. 2004లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన తొలి సిరీస్ అదే. 
 
1989లో తొలిసారి భారత్ క్రికెట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న గంగూలీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రయత్నాలు చేస్తారా అనేదానిపై చర్చ జరిగింది. కానీ ఈ విషయంలో ప్రభుత్వాల అనుమతే ముఖ్యమని తేల్చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments