Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్ టెండూల్కర్.. సెహ్వాగ్ కూడా రంగంలోకి?

Advertiesment
మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్ టెండూల్కర్.. సెహ్వాగ్ కూడా రంగంలోకి?
, బుధవారం, 16 అక్టోబరు 2019 (10:25 IST)
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్సుకు శుభవార్త. సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రికెట్ ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013 నవంబరు 16న వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం మరోసారి ట్వంటీ-20 లీగ్‌లో మెరవనున్నాడు. బ్రియాన్ లారాతో కలిసి వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బ్యాట్ పట్టనున్నాడు.. మాస్టర్ బ్లాస్టర్.
 
ఈ టోర్నమెంట్ 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 16వరకూ భారత దేశ వ్యాప్తంగా జరగనుంది. సునీల్ గవాస్కర్‌కు చెందిన పీఎంజీ, మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. 
 
ఈ టోర్నీలో ఐదు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు చాలా కాలం తర్వాత తిరిగి బ్యాట్ పట్టుకోనున్నారు. టెండూల్కర్, లారా వంటి దిగ్గజాలతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బ్రెట్ లీ, శ్రీలంక తిలకరత్నె దిల్‌షాన్, దక్షిణాఫ్రికా జాంటీ రోడ్స్ ఆడుతున్నారు. మొత్తం 110మంది ప్లేయర్లు టోర్నీలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవర్లుగా మారుతున్న పాకిస్థాన్ క్రికెటర్లు... కారణం ఏంటంటే...