Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:42 IST)
సిడ్నీ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా వచ్చిన భారత మహిళల క్రికెట్ నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. గత టోర్నీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 
 
ఇదిలావుంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెరుగైన రన్‌రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

గ్రూపు ఏ లో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, పటిష్టమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. చివరగా ఇంగ్లండ్‌తో గురువారం మ్యాచ్ జరగాల్సివుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments