Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (12:21 IST)
మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసింది. 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ (2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) రికార్డు సృష్టించి... అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. 
 
మరోవైపు తాజా రికార్డుతో పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును మిథాలీ అధిగమించినట్లయింది. రోహిత్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ (2,102 పరుగులతో) భారత్‌ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు.
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం ఐర్లాండ్‌ జట్టుతో తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments