Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (12:21 IST)
మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసింది. 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ (2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) రికార్డు సృష్టించి... అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. 
 
మరోవైపు తాజా రికార్డుతో పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును మిథాలీ అధిగమించినట్లయింది. రోహిత్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ (2,102 పరుగులతో) భారత్‌ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు.
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం ఐర్లాండ్‌ జట్టుతో తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments