Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్‌ వుండడట.. ఫ్యాన్స్‌కు షాక్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:00 IST)
కివీస్ పర్యటనలో టీమిండియా జట్టు అదరగొడుతోంది. టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. 
 
అయితే ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ ఆడట్లేదనే షాకింగ్ నిజాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం వుందని ఇప్పటికే క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్వంటీ-20 సిరీస్‌లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments