Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్ ఖాతాలో మరో కాంస్యం

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (22:28 IST)
Harvinder singh
పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం లభించింది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుని ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించాడు. 
 
దక్షిణ కొరియా ఆటగాడు కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించిన హర్విందర్ పతకం సాధించాడు. ఫలితంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు పెరిగింది. భారత్‌కు ఈ రోజు ఇది మూడో పతకం కావడం గమనార్హం. 
 
ప్రవీణ్ కుమార్, అవని లేఖర అంతకుముందు పతకాలు గెలుచుకున్నారు. పతకాల పట్టిలో భారత్ 2 స్వర్ణాలు, 6 రజత పతకాలు, 5 కాంస్య పతకాలతో 37వ స్థానంలో ఉంది. 
 
మరోవైపు, బ్యాడ్మింటన్ పురుషుల మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడీ ప్రమోద్ భగత్, పాలక్ కోహ్లీ జోడీ సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. 
 
సింగిల్స్ ప్లేయర్, నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 గ్రూప్ ఎ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ మాజుర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 
 
కాగా, ప్రమోద్ భగత్-పాలక్ కోహ్లీ జంట రేపు (శనివారం) జరగనున్న సెమీస్‌లో హారీ సుసంటో- లీని రాత్రి‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో సుహాస్, తరుణ్ ధిల్లాన్, మనో జ్ సర్కార్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments