Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండ్యా పరాక్రమం.. నాటింగ్‌హామ్ టెస్టుపై భారత్ పట్టు

భారత బౌలర్ హార్దిక్ పాండ్యా పరాక్రమం చూపడంతో నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (11:50 IST)
భారత బౌలర్ హార్దిక్ పాండ్యా పరాక్రమం చూపడంతో నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ పాండ్యా కీలక వికెట్లను తీయడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరు చేయగలిగింది.
 
ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ 39, కుక్ 29, కీటన్ జెన్నింగ్స్ 20 పరుగులు చేయగా.. భారత్ బౌలర్లు హార్దిక్ పాండ్య 5, ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయడంతో భారత్ 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 46 రన్స్ ఉన్న ఇంగ్లండ్.. టీ బ్రేక్‌కు 38.2 ఓవర్లలో ఆలౌట్ అయింది.  
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్లకు 124 పరుగులు చేసింది. కోహ్లీ (8 బ్యాటింగ్), పుజార (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ధవన్ (44), రాహుల్ (36) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఓవరాల్‌గా విరాట్‌సేన 292 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments