Webdunia - Bharat's app for daily news and videos

Install App

భళా భజరంగ్.. భారత్‍కు తొలి స్వర్ణం ... భారతరత్న వాజ్‌పేయికి అంకితం

ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం వచ్చి చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 65కిలోల ప్రీస్టైల్ విభాగం ఫైనల్లో బజ్‌రంగ్ 11-8 తేడాతో తకాతనీ దైచీ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:57 IST)
ఇండోనేషియా రాజధాని జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం వచ్చి చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 65కిలోల ప్రీస్టైల్ విభాగం ఫైనల్లో బజ్‌రంగ్ 11-8 తేడాతో తకాతనీ దైచీ(జపాన్)పై గెలుపు ఢంకా మోగించాడు.
 
తొలుత 6-0తో పూనియా ముందంజ వేసినా.. ఒక్కసారిగా పుంజుకున్న జపాన్ రెజ్లర్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పూనియాకు దీటైన పోటీనిస్తూ పాయింట్లు కొల్లగొట్టాడు. అయితే తన శక్తినంతా కూడదీసుకుంటూ జపాన్ రెజ్లర్ ఎత్తులను బజ్‌రంగ్ చిత్తుచేశాడు. 
 
ఏ మాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాయింట్ల మధ్య అంతరం ఒకింత తగ్గినా ఒత్తిడికి లోనుకాకుండా తొలి రౌండ్‌లో 2-2-2తో ఆరు పాయింట్లు, రెండో రౌండ్‌లో 2-2-1తో ఐదు పాయింట్లు దక్కించుకున్నాడు.
 
ఈ విజయం తర్వాత భజరంగ్ పూనియా స్పందిస్తూ, ఈ విజయాన్ని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి అంకితమిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాను. యోగీ బాయ్(యోగేశ్వర్ దత్) చెప్పినట్లుగానే ఈ ఆసియాడ్‌లో స్వర్ణం గెలిచాను. ఇది నా కెరీర్‌లోనే మరుపురాని పతకం. ఇక్కడ విజయం సాధిస్తే రానున్న టోక్యో(2020)లో పోటీలో ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఇదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ నసాగించాలనుకుంటున్నాను. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా మరింత సిద్ధమవుతాను అని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments