Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్‌

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (12:25 IST)
కివీస్‍తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20లో పాక్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ 3-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 
 
కివీస్ బౌలర్లను హడలెత్తించిన బాబర్ ఆజమ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఆసీస్‌తో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ను కూడా పాకిస్థాన్ వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ అదరగొట్టింది. ధాటిగా ఆడిన మహ్మద్ హఫీజ్ 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పాక్ స్కోరు 166కు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. 
 
ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విలియమ్సన్ 38 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ ఫిలిప్ (26), ఐష్ సోధి 11(నాటౌట్) తప్ప మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోయారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు, ఇమాద్ వసీం, వఖాద్ మక్సూద్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments