Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ.. 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

Webdunia
శనివారం, 3 జులై 2021 (23:08 IST)
గతేడాది కోవిడ్ కారణంగా సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా  మొత్తం 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. 
 
నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా  టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.
 
అప్పుడు కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27 నుంచి సీనియర్‌ మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ ఉంటుంది. 
 
ఈ క్రమంలోనే అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments