Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీల్‌ఛైర్‌‍లో ఉన్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుంది.. సో... నేను ఆడుతూనే ఉంటా : ధోనీ

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (19:45 IST)
తాను ఆడలేక వీల్‌చైర్‌లో కూర్చొనివున్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుందని, అందువల్ల ఎన్నాళ్లు ఆడాలనుకుంటే అంతకాలం ఆడుతూనే ఉంటానని మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన ధోనీ... ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెపుతారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధోనీ ప్రశాంతంగా స్పందించారు. 
 
"చెన్నై సూపర్ కింగ్స్ - సీఎస్కే. ఇది నా ఫ్రాంచైజీ. సీఎస్కే తరపున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే వాళ్లు నన్ను లాక్కెళుతారు" అని వ్యాఖ్యానించారు. 2023 ఐపీఎల్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడిన ధోనీ.. ఆ సీజన్ ముగిశాక సర్జరీ చేయించుకున్నాడు. గత యేడాది ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎనిమిదో ప్లేస్‌లోనూ బ్యాటింగ్ చేశాడు. అయితే, ఈ సారి మాత్రం పూరతిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టులో ఒక సభ్యుడుగా సేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు. అలాగే, బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ కాస్త ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments