Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీపై పరువునష్టం కేసు

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (12:15 IST)
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువునష్టం కేసును ఆయన వ్యాపార భాగస్వాములు నమోదు చేశారు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 
 
ఒప్పందాన్ని ఉల్లంఘించడం, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, అందుచేత నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.
 
2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ. 16 కోట్లు ఎగ్గొట్టారని ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయని పిటిషన్‌లో  పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న (గురువారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. 
 
కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లైంగిక సమ్మతికి 18 యేళ్లు నిండాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

నిండు ప్రాణం తీసిన స్కూటర్ పార్కింగ్ గొడవ - మృతుడు హీరోయిన్ కజిన్

EAGLE: డ్రగ్స్ తీసుకున్న 32 మంది విద్యార్థులు.. వీరు మెడికల్ కాలేజీ విద్యార్థులు తెలుసా?

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments