Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ చిత్తు... భారత్ ఖాతాలో ట్వంటీ20 సిరీస్

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (12:27 IST)
నాగ్‌పూర్‌లో జరిగిన ట్వంటీ-20లో టీమిండియా ఘన విజయం సాధించింది. చాహర్‌ మ్యాజిక్‌తో టీమిండియా అదిరిపోయే విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇంకా లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ బోల్తా పడింది.. ఫలితంగా 2-1 తేడాతో టీ-20 సిరీస్‌ను రోహిత్‌ సేన కైవసం చేసుకుంది.. తొలి మ్యాచ్‌లో పరాభవాన్ని చవిచూసినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌ రౌండ్‌షోతో అదరగొట్టింది టీమిండియా. 
 
చాహర్‌ మ్యాజిక్‌తో నాగ్‌పూర్ టీ-20 సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. చాహర్‌ తన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌కు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. 
 
ఇన్నింగ్స్‌ ప్రారంభంలో బంగ్లాందేశ్ కీలక బ్యాట్స్‌మెన్‌ లింట్‌డాస్‌, సౌమ్య సర్కార్‌, మిథున్‌ను పెవిలియన్‌ చేర్చిన రాహుల్‌.. చివరల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్రను పోషించాడు. టీ-20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఇండియన్‌గా చాహర్‌ రికార్డుల్లో నిలిచాడు. 2012లో జింబాబ్వేపై 8 పరుగులకు ఆరు వికెట్లతో శ్రీలంక బౌలర్‌ మెండిస్‌ నెలకొల్పిన రికార్డును చాహర్‌ తిరగరాశాడు. 
 
ఇకపోతే, ముందుగా టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ రెండు పరుగులకే పెవిలియన్‌ బాట పట్టాడు. రెండో ఓవర్‌లో షఫీల్‌ వేసిన బాల్‌కు రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ధావన్‌ కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయాడు. 19 పరుగులకే ఔటయ్యాడు. దీంతో 35 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
 
ఆ తర్వాత వచ్చిన మొదట రాహుల్‌, అయ్యర్‌ ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. హాఫ్‌ సెంచరీ చేసి రాహుల్‌ ఔటైనా.. అయ్యర్‌ మాత్రం తన జోరును కొనసాగించాడు. అఫిఫ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు సాధించి టీ20ల్లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. చివర్లో మనీష్‌ పాండే దాటిగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి టీమిండియా 174 పరుగులు చేసింది.
 
175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మొదట దూకుడు చూపించింది. ఓపెనర్‌ మహమ్మద్‌ నైమ్‌ 81 పరుగులు సాధించడంతో ఓ దశలో బంగ్లా విజయం ఖాయంలా కనిపించింది. అయితే, చాహర్‌ మ్యాజిక్‌తో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. చాహర్‌ తన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌కు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఫలితంగా థర్డ్‌ టీ-20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1 తేడాతో రోహిత్‌ సేన సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments