Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు : వాడా డిమాండ్

భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డిమాండ్ చేస్తోంది. దీంతో బీసీసీఐకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరిపిన వాడా.. కొన్ని ప్రత్యేక

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (09:05 IST)
భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డిమాండ్ చేస్తోంది. దీంతో బీసీసీఐకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఐసీసీతో చర్చలు జరిపిన వాడా.. కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. 
 
బీసీసీఐ అనుమతితో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ ద్వారా భారత క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఒకవేళ బీసీసీఐ ఇందుకు ఒప్పుకోకపోతే నాడా గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వాడా అక్రిడేషన్‌ పొందిన నాడా గుర్తింపు రద్దు అయితే భారత క్రీడాకారులు ఎవరూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశమే ఉండదు. 
 
దీనిపై ఇప్పటికే వాడా కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌కు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి లేఖ రాయాలని రాథోడ్‌ కేంద్ర క్రీడలశాఖ కార్యదర్శి శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాడాతో బీసీసీఐ కలిసి పని చేయాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments