Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. భారత్‌లో ఉండలేం.. ప్రత్యేక విమానం కోసం ఆసీస్ క్రికెటర్ వినతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:46 IST)
ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి ఎవరూ ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు, బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 14వ సీజన్ పోటీలూ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ దెబ్బకు అనేక మృత్యువాతపడుతున్నారు. దేశంలో భయానక వాతావరణం నెలకొనివుంది. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తమతమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇపుడు తమను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్‌ విమానం ఏర్పాటు చేయాలని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్‌ లీన్‌.. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరాడు. 
 
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఐపీఎల్‌ టోర్నీపైనా పడింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరిలో ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో టోర్నీ ముగిసిన వెంటనే ఆసీస్‌ ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రిస్‌ లీన్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరాడు.
 
'ఏటా ఐపీఎల్‌ ఒప్పందంలో భాగంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా 10 శాతం మొత్తాన్ని చార్టర్డ్‌ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్‌ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం’ అని క్రిస్‌ లీన్‌ అభిప్రాయపడ్డాడు. 
 
భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో లీన్‌ ఇలా అభ్యర్థించడం గమనార్హం. మరోవైపు, ఐపీఎల్‌ ఆడుతున్న ఆసీస్‌ ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌ ప్రకటించారు. 
 
‘వారంతా అక్కడకు ప్రైవేట్‌గా వెళ్లారు. ఇదేమీ ఆస్ట్రేలియన్‌ టూర్‌ కాదు. వాళ్లకు సొంత వనరులు ఉన్నాయి. వారు వాటిని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకుని వారంతా ఆస్ట్రేలియాకు వస్తారని భావిస్తున్నా’ అని మోరిసన్‌ ప్రకటించడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments