Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రామా మధ్య ఎట్టకేలకు పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:10 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ ప్రవంచ వన్డే క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. అయితే, ఆ జట్టు సభ్యులకు వీసాలు మంజూరు చేసే విషయంలో జాప్యం నెలకొంది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పీసీబీ.. ఐసీసీకి సోమవారం లేఖ రాసింది. ఆ తర్వాత హైడ్రామా మధ్య పాక్ క్రికెటర్లకు భారత ఎంబసీ అధికారులు ఎట్టకేలకు వీసాలు మంజూరు చేశారు. దీంతో ఈ నెల 27వ తేదీన దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేరుకోనుంది.
 
భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. 29వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ జట్టుకు భారత్ వీసాలు మంజూరు చేసింది. మరోవైపు, వీసాల మంజూరులో ఆలస్యం కారణంగా దుబాయ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న టీమ్ బిల్డింగ్ ప్లాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ గడ్డలో టీడీపీ పుట్టింది.. పూర్వ వైభవం ఖాయం.. బాబు

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

భక్తులకు వాటర్ బాటిళ్లు ఆ ధరకే విక్రయించాలి.. టీటీడీ వార్నింగ్

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments