Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రామా మధ్య ఎట్టకేలకు పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:10 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ ప్రవంచ వన్డే క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. అయితే, ఆ జట్టు సభ్యులకు వీసాలు మంజూరు చేసే విషయంలో జాప్యం నెలకొంది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పీసీబీ.. ఐసీసీకి సోమవారం లేఖ రాసింది. ఆ తర్వాత హైడ్రామా మధ్య పాక్ క్రికెటర్లకు భారత ఎంబసీ అధికారులు ఎట్టకేలకు వీసాలు మంజూరు చేశారు. దీంతో ఈ నెల 27వ తేదీన దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేరుకోనుంది.
 
భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. 29వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ జట్టుకు భారత్ వీసాలు మంజూరు చేసింది. మరోవైపు, వీసాల మంజూరులో ఆలస్యం కారణంగా దుబాయ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న టీమ్ బిల్డింగ్ ప్లాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments