Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ - పోలీసులు విఫలమయ్యారు : చంద్రబాబు

Webdunia
బుధవారం, 25 మే 2022 (08:57 IST)
పచ్చటి కోనసీమలో అగ్గి రాజుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళనకారులు మంగళవారం అమలాపురంలో తీవ్ర విధ్వంసం సృష్టించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే, ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయంటూ ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. 
 
వీటిని టీడీపీ, జనసేన పార్టీలు ఖండించారు. ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. 
 
ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments