Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు వర్షం అంతరాయం

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:00 IST)
studium
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. 
 
ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సేపటి వరకూ వర్షం కురుస్తూనే ఉండటంతో నాలుగో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (4 నాటౌట్‌), శుభ్‌మన్ గిల్‌(0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.
 
సిరాజ్‌కు 5 వికెట్లు..
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 327 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్‌..
 
టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అటు శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో స్మిత్ 55, వార్నర్ 48, గ్రీన్ 37 పరుగులు చేశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments