Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు వర్షం అంతరాయం

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:00 IST)
studium
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. 
 
ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సేపటి వరకూ వర్షం కురుస్తూనే ఉండటంతో నాలుగో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (4 నాటౌట్‌), శుభ్‌మన్ గిల్‌(0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.
 
సిరాజ్‌కు 5 వికెట్లు..
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 327 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్‌..
 
టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అటు శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో స్మిత్ 55, వార్నర్ 48, గ్రీన్ 37 పరుగులు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

తర్వాతి కథనం
Show comments