Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు హర్యానా హరికేన్‌.. రాష్ట్రపతి కోటాలో...

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ కాగా, ఈయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఇపుడు రాష్ట్రపతి కోటాలో కపిల్ దేవ్‌తో

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (18:05 IST)
భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ కాగా, ఈయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఇపుడు రాష్ట్రపతి కోటాలో కపిల్ దేవ్‌తో పాటు.. సినీ నటి మాధూరీ దీక్షిత్‌లను పెద్దల సభకు పంపాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
 
నిజానికి కపిల్ దేవ్ ఓ క్రికెట్ లెజెండ్. మిస్టర్ కూల్ కెప్టెన్. దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన సారథి. తన పని తాను చేసుకుపోతూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వ్యక్తి. ఇప్పటివరకు ఏ పార్టీకి సపోర్ట్ ప్రకటించలేదు. కానీ, పరోక్షంగా మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లు జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. 
 
ఇందుకు బలం చేకూర్చుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. స్వయంగా తానే కపిల్ దేవ్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు గంటసేపు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సెలబ్రిటీలను కలుస్తూ ఉన్నారు. 
 
ఇందులో భాగంగానే కపిల్‌తోనూ భేటీ అయినా.. ఆయన్ను మాత్రం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ్య సభ్యుల జాబితాలో కపిల్ దేవ్‌కు చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. 
 
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే కపిల్ దేవ్‌తో ప్రమాణస్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షా కూడా హామీ ఇచ్చినట్లు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రపతి నామినేటెడ్ చేసే రాజ్యసభ ఎంపీల్లో కపిల్ దేవ్ ఎంపిక అయినా.. పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments