Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం ఆమోదముద్ర వేస్తే బీసీసీఐ చీఫ్‌గా ఐదేళ్ళపాటు గంగూలీనే!

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (12:35 IST)
లోథా కమిటీ సంస్కరణ మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసినపక్షంలో వచ్చే ఐదేళ్లపాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా సౌరవ్ గంగూలీనే కొనసాగనున్నారు. 
 
సాధారణంగా లోథా కమిటీ సంస్కరణల ప్రకారం భారత క్రికెట్ వ్యవస్థల్లో వరుసగా ఆరేళ్లపాటు పదవుల్లో ఉన్న వ్యక్తి మరోసారి పదవి చేపట్టాలంటే మూడేళ్ల విరామం తప్పనిసరి. కానీ, మాజీ కెప్టెన్ గంగూలీ 2015 నుంచి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు. 
 
ఆయన ఆ పదవిలో ఉండగానే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లోథా కమిటీ సంస్కరణల ప్రకారం గంగూలీ యేడాది కంటే తక్కువ సమయంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి.
 
అయితే, బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టిన వెంటనే లోథా సంస్కరణలను మార్చడంపై దృష్టి పెట్టారు. ఇదే అంశంపై ఆయన సర్వసభ్య సమావేశం నిర్వహించి లోథా కమిటీ సంస్కరణల మార్పుపై సభ్యుల అభిప్రాయాన్ని సేకరించారు. 
 
వారందరూ లోథా కమిటీ సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మాన ప్రతిని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై అపెక్స్ కోర్టు ఆమోదముద్ర వేసిన పక్షంలో వచ్చే ఐదేళ్ళ పాటు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments