Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు మ్యాచ్‌ల టిక్కెట్లు ఒక్కరోజే ఖాళీ! (video)

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:35 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇటీవల యూఏఈ గడ్డపై జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ముగిసిన వెంటనే అక్కడ నుంచి అటే సిడ్నీ నగరంలో కాలుమోపింది. ప్రస్తుతం కోవిడ్ మార్గదర్శకాల మేరకు 14 రోజుల క్వారంటైన్‌లో భారత క్రికెట్ జట్టు ఉంది. 
 
అయితే, ఈ పర్యటనలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు ట్వంటీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత వన్డే సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 
 
అయితే, ఈ రెండు జట్ల పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లు శుక్రవారం అమ్మకానికి ఉంచగా తొలిరోజే అదిరిపోయే స్పందన వచ్చింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్‌ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. 
 
అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్‌నే అనుమతిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments