Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. చుక్కలు చూపించిన భారత్

పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. చుక్కలు చూపించిన భారత్
, శనివారం, 14 నవంబరు 2020 (09:14 IST)
పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. గతేడాది ఆగస్ట్ నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. తుపాకీ తూటాలు, మోర్టాన్‌లతో కాల్పులకు తెగబడింది. సైనికులతో స్థావరాలతో పాటుగా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆరుగురు పౌరులు మరణించారు.
 
కొన్ని ఇల్లు ధ్వంసం అయ్యాయి. గురేజ్ నుంచి ఉరి సెక్టార్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇండియాలోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం చేసింది. అయితే, పాక్‌కు బుద్ధిచెప్పేందుకు ఇండియా సైన్యం ఎదురుదాడికి దిగింది. 
 
రాకెట్ల వర్షం కురిపించింది. ఇండియా ఎదురుదాడిలో పాక్ లోని అనేక సైనిక బంకర్లు, లాంచింగ్ ప్యాడ్లు, చమురు నిల్వలు ధ్వంసం అయ్యాయి. 11 మంది పాక్ సైనికులు హతం అయ్యారు. అనేక మంది పాక్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను శుక్రవారం భారత ఆర్మీ విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైనికులకు గౌరవ వందనంగా దియాను గెలిగించిండి.. ప్రధాని పిలుపు