Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ : పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (23:28 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తద్వారా ప్రత్యర్థి ఆటగాళ్ల ముంగిట నిర్ధేశించిన 182 పరుగుల విజయలక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలివుండగానే పాకిస్థాన్ జట్టు గెలుపొందింది. 
 
ఆ జట్టులో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 71 పరుగులు, మరో ఓపెనర్, కెప్టెన్ బాబర్ అజమ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఖక్తర్ జమాన్ 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేయగా, మహ్మద్ నవాజ్ 20 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. అసిఫ్ అలీ 16, ఖుష్‌దిల్ షా 14 (నాటౌట్), అహ్మద్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేసి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్ధిక్ పాండ్యా, చాహల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 28 (20 బంతులు 1 ఫోరు, 6 సిక్సర్లు), కేఎల్ రాహుల్ 28 (16 బంతులు 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13, రిషభ్ పంత్ 12 బంతుల్లో 14 రన్స్, దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 రన్స్, రవి బిష్ణోయ్ 2 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 8 చొప్పున పరుగులు చేశారు. 
 
లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై చెలరేగిన హార్దిక్ పాండ్యా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. పాక్ బౌలర్లలో షదాబ్ ఖాన్ 2, నసీం షా, హుస్నైన్, రౌఫ్, నవాజ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. విరాట్ కోహ్లీ వికెట్‌ను రనౌట్ రూపంలో పడగొట్టారు. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పులుచేసింది భారత తుది జట్టుకు ఎంపిక చేసినవారిలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్, ఫక్తర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హోస్నైన్, నజీం షాలకు తుది జట్టులో చోటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

తర్వాతి కథనం
Show comments