Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ : పాకిస్థాన్ టార్గెట్ 182

pak batsmens
, ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (21:39 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సూపర్-4 మ్యాచ్‌లో దాయాది దేశాలైన పాకిస్థాన్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తద్వారా పాకిస్థాన్ ముంగిట 182 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 28 (20 బంతులు 1 ఫోరు, 6 సిక్సర్లు), కేఎల్ రాహుల్ 28 (16 బంతులు 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 10 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 13, రిషభ్ పంత్ 12 బంతుల్లో 14 రన్స్, దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 రన్స్, రవి బిష్ణోయ్ 2 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 8 చొప్పున పరుగులు చేశారు. 
 
లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై చెలరేగిన హార్దిక్ పాండ్యా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. పాక్ బౌలర్లలో షదాబ్ ఖాన్ 2, నసీం షా, హుస్నైన్, రౌఫ్, నవాజ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. విరాట్ కోహ్లీ వికెట్‌ను రనౌట్ రూపంలో పడగొట్టారు. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పులుచేసింది భారత తుది జట్టుకు ఎంపిక చేసినవారిలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్, ఫక్తర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హోస్నైన్, నజీం షాలకు తుది జట్టులో చోటు కల్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్