Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ఛైర్మన్‌గా అనిల్ కుంబ్లే

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (11:34 IST)
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారి కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన కుంబ్లే మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. స్పిన్‌ మాంత్రికుడు అనిల్‌ తొలిసారి 2012లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 
 
దుబాయ్‌లో ఆరు రోజుల పాటు జరిగిన ఐసీసీ సమావేశాల్లో కుంబ్లే ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్లో 18 ఏళ్ల పాటు కొనసాగిన లెగ్‌స్పిన్నర్‌ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రెండో ఆటగాడు కుంబ్లేనే కావడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments