Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాతో 4th T20I: 82 పరుగుల తేడాతో భారత్ గెలుపు

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (11:47 IST)
Team India
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమితో ఇక సిరీస్ చేజార్చుకుందనుకున్న సమయంలో తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి సఫారీలపై వరుస విజయాలు నమోదు చేసింది. 
 
శుక్రవారం (జూన్ 17) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. టాప్-4 బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (4), ఇషాన్ కిషన్ (27), శ్రేయాస్ అయ్యర్ (4), రిషబ్ పంత్ (17) పరుగులు మాత్రమే చేశారు. 
 
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కేలా చేశారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా మహారాజ్, ప్రెటోరియస్, మార్కో జాన్సెన్, నోర్ట్జే తలో వికెట్ తీశారు. 
 
టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాహల్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
 
ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉన్నాయి. టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం (జూన్ 19) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments