Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే యేడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంపు

Advertiesment
ipl2015
, బుధవారం, 15 జూన్ 2022 (10:56 IST)
వచ్చే యేడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్య పెంచనున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, మీడియా హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. 
 
ఐపీఎల్‌లో ఓ సీజన్ నిడివి రెండున్నర నెలలు ఉండేలా ఐసీసీ షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఓ ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. పైగా వచ్చే ఐపీఎల్ సీజన్ రెండున్నర నెలలు జరిగే అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. 
 
ఈ మేరకు తాము అన్ని దేశాల క్రికెట్ బోర్డులతోనూ, ఐసీసీతోనూ చర్చించామని వెల్లడించారు. తద్వారా ఐపీఎల్ కు అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులు అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం అయిందని జై షా తెలిపారు. అంతేకాదు, వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్ కూడా తమ ప్రాధాన్యతాంశమని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్‌లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా