Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ప్రధాని లేఖ.. ధన్యవాదాలు తెలిపిన మహీ.. ఆర్మీతో కలిసి పనిచేస్తాడా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (18:51 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15న అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన సంగతి తెలిసిందే. దాదాపుగా 16 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించి ఉన్నట్టుండి.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ స్వస్తి చెప్పడం అందరికీ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో సారథిగా అతను భారత్ క్రికెట్‌ను విజయాల తీరాలకు చేర్చిన తీరు అద్భుతం అంటూ పలువురు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
 
ఇంకా ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహేంద్ర సింగ్ ధోనీ సేవలను కీర్తిస్తూ లేఖ రాశారు. యువలోకానికి ధోనీ స్పూర్తధాయకమైన నాయకుడాని, గొప్ప మార్గదర్శకుడంటూ మోదీ అభినందించారు. ఫలితం ఏదైనా సమానంగా స్వీకరించే తత్వం ధోనీది అన్నారు. చిరస్థాయిగా అతని పేరు నిలిచిపోతుందంటూ కొనియాడారు.
 
ధోనీ అంటే కేవలం గణాంకాలు, మ్యాచ్ రికార్డ్‌లుగా గుర్తించుకోవడం సమంజసం కాదని మోదీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ధోనిని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడటం తగదన్నారు. తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధాన్ని మోదీ ప్రస్తావించారు. 
 
నరేంద్ర మోదీ లేఖపై మహేంద్రసింగ్ ధోనీ స్పందిస్తూ..'ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలే. ప్రధాని మోదికి ధన్యవాదాలు' అని తెలిపాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పడంతో ఇక ఏటా కొన్ని రోజులు ఆర్మీతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments