Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కకు టీకప్పులు అందిస్తున్న సెలక్టర్లు (video)

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (16:11 IST)
భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ టీమిండియా సెలక్టర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీనటి అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలక్టర్ల పని అంటూ విమర్శించారు. ఇది మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ అని సెటైర్ వేశాడు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని ఫరూక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అసలు ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. సెలక్టర్లపై కోహ్లీ ప్రభావం మంచిది కాదని చెప్పారు. పది నుంచి 12 టెస్టు మ్యాచుల కంటే ఎక్కువ వీరెవరూ ఆడలేదని వెల్లడించారు. 
 
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఒక సెలెక్టర్‌ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ ఇంజినీర్ తెలిపారు. ఇండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో.. ఎవరని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
ఇండియా బ్లేజర్ వేసుకున్నవారంతా సెలక్టర్లు అని చెప్పడంపై ఫరూక్ మండిపడ్డారు. సెలెక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ ఉండాలని తాను భావిస్తున్నానని ఫరూక్ ఇంజినీర్ చెప్పారు. వెంగ్ సర్కార్ లాంటి వ్యక్తులు కమిటీలో వుండాలని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

లోక్‌సభ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments