మానవాళికి పెనుముప్పుగా కరోనా... 204 దేశాలకు వ్యాప్తి.. 50 వేల మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:51 IST)
మానవాళికి కరోనా వైరస్ పెనుముప్పుగా మారింది. ఈ వైరస్ దేశాల సరిహద్దులను యధేచ్చగా దాటిపోతోంది. ఫలితంగా ఇప్పటివరకు ఏకంగా 204 దేశాలకు వ్యాపించింది. పైగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారానికి ఈ సంఖ్య 52982కు చేరింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1014256గా ఉన్నాయి. 
 
ముఖ్యంగా ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,242 కాగా, మృతుల సంఖ్య 13,915కి పెరిగింది. స్పెయిన్ లోనూ ఇదే తరహా భయానక పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,065 కాగా, మృతిచెందిన వారి సంఖ్య 10,348.
 
ఇక పాజిటివ్ కేసుల విషయానికొస్తే అగ్రరాజ్యం అమెరికా ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడక్కడ 2,44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,886 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. 59,105 పాజిటివ్ కేసులు నమోదవగా, 5,387 మంది మరణించారు. 
 
భారతదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది అప్ డేట్: రామ్ చరణ్ బర్త్ డే నాడు పెద్ది క్యారెక్టర్ పోస్టర్, బుకింగ్స్ ఓపెన్

Diya: డిజిటల్ యుగంలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు : రఘుకుంచె

Anirudh Ravichander: ముప్పైవేల అభిమానులతో రికార్డు సృష్టించి కాన్సర్ట్ అందించిన అనిరుధ్ రవిచందర్

A.R. Rahman: యమహా మ్యూజిక్ ఇండియా సంస్థ అంబాసడర్‌గా ఎ.ఆర్. రెహ్మాన్

Sharwa:సీనియర్స్ తర్వాతే మేము : శర్వా ; అవకాశాల కోసం రాజశేఖర్ విజ్నప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments