Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 61178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 1367 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు. అలాగే, 1248 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,34,786కి చేరగా.. ఇందులో 20,06,034 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 14044కి చేరింది.
 
తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 14,708 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కృష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments