Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా రెండో రోజు కూడా 20 వేలకు దిగువనే...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:27 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నాయి. వరుసగా రెండో యేడాది కూడా ఈ కేసుల సంఖ్య 20 వేలకు దిగువున నమోదయ్యాయి. ఈ యేడాది మార్చి 11వ తర్వాత తొలిసారిగా మంగళవారం (సెప్టెంబర్‌ 28) 20 వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 18,795 వేల కేసులు నమోదయ్యాయి. బుధవారం కూడా ఇదే సంఖ్యలో నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కు చేరింది. ఇందులో 3,29,86,180 మంది కరోనా నుంచి బయటపడగా, 4,47,751 మంది బాధితులు మరణించారు. 
 
మరో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,178 మంది కరోనా నుంచి బయటపడగా, 378 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 11,196 కేసులు ఉన్నాయని, 149 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం ఒకేరోజు 54,13,332 మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు 87,66,63,490 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. 
 
కాగా, సెప్టెంబర్‌ 28 వరకు దేశంలో 56,74,50,185 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 15,04,713 మందికి పరీక్షలు చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments