గీత దాటితే చర్యలు తప్పవు: ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజాకు పార్టీ హెచ్చరిక

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:02 IST)
పార్టీని అప్ర‌దిష్ట‌పాలు చేసే ఏ వివాదం లేపినా, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ యువ‌నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైకాపా నేతల పంచాయితీ జ‌రుగుతోంది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. 
 
అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డి రెండు విడతలుగా భరత్, జక్కంపూడి రాజాతో భేటీ అయ్యారు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడి సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ఈ పంచాయితీ కొనసాగింది. ఇవాళ్టి సమావేశంపై రేపు మీడియాతో మాట్లాడతానని ఎంపీ భరత్‌ తెలిపారు. 
 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ,  చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. ఈ రకంగా ఇద్ద‌రు యువ‌నేత‌లు ప‌రస్ప‌రం ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం, పార్టీకి న‌ష్టం క‌లిగిస్తోంద‌ని అధిష్ఠానం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments