దేశంలో కొత్తగా 16135 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:02 IST)
దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3.32 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఇందులో 16135 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసులు 1,13,864కి చేరాయి. క్రియాశీల రేటు 0.26 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.53 శాతానికి పడిపోయింది. ఆదివారం 13,958 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

Tharun Bhascker: జింగాలా సాంగ్ కు డాన్స్ వేసిన గాయపడ్డ సింహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments