తితిదేలో అర్చకులకు కరోనా పాజిటివ్?

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఏడుగురు అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఈ ఏడుగురుతో కలుపుకుని కరోనా వైరస్ బారినపడిన మొత్తం అర్చకుల సంఖ్య 15కు చేరింది. 
 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు. ఈ అర్చకులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారు. ఎంతమందిని కలిసారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అత్యవసరంగా తితిదే అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల గిరుల్లో కరోనా తీవ్రతపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 
 
కాగా, తితిదేలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ సిబ్బంది సంఖ్య వందకుపైగానే ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇపుడు అర్చకులకు కూడా వైరస్ సోకిందన్న సమాచారంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments