Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో అర్చకులకు కరోనా పాజిటివ్?

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఏడుగురు అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఈ ఏడుగురుతో కలుపుకుని కరోనా వైరస్ బారినపడిన మొత్తం అర్చకుల సంఖ్య 15కు చేరింది. 
 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు. ఈ అర్చకులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారు. ఎంతమందిని కలిసారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అత్యవసరంగా తితిదే అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల గిరుల్లో కరోనా తీవ్రతపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 
 
కాగా, తితిదేలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ సిబ్బంది సంఖ్య వందకుపైగానే ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇపుడు అర్చకులకు కూడా వైరస్ సోకిందన్న సమాచారంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments