Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు పొరలున్న మాస్క్‌తో 70 శాతం రక్షణ

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:09 IST)
దేశం కరోనా వైరస్ మహమ్మారి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ సోకకుండా కేవలం సర్జికల్ మాస్క్ మాత్రమే ధరించాలన్న నియమ నిబంధన లేదనీ, మూడు పొరలు ఉన్న క్లాత్ మాస్క్ అయినా సరిపోతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మూడు పొరలతో కూడిన క్లాత్ మాస్కు కూడా సర్జికల్ మాస్క్ స్థాయిలోనే పనిచేస్తుందని బ్రిస్టల్, సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
 
మూడు పొరలతో ఉన్న మాస్క్ ధరించిన వారు శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి వెళ్లే గాలి మెలి తిరుగుతుందని, ఫలితంగా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు గాలి వెళ్లే మార్గం ద్వారా వెళ్లలేవని తేలింది. 
 
మాస్కులోని పోగులను ఢీకొట్టి అవి అక్కడే ఆగిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సరిగా ధరించే మూడు పొరల మాస్క్ వల్ల 50 నుంచి 70 శాతం వరకు రక్షణ లభిస్తుందని వివరించారు.
 
అలాగే, ఇటీవల భారత్‌లో జరిగిన ఓ అధ్యయనంలో కూడా మూడు పొరలున్న క్లాత్ మాస్కే ఉత్తమని తేలింది కూడా. దీంతో పలువురు ఈ తరహా మాస్కులను ధరిస్తున్నారు. అయితే, డబ్బున్నవారు మాత్రం ఎన్95 మాస్కులను ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments