Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు... 24 గంటల్లో 2,511 కేసులు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (10:03 IST)
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా వున్నాయి. గత కొద్దిరోజుల నుండీ ఈ కేసులు మూడు వేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు మళ్ళీ భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,511 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. ఇక శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 11 మంది కరోనా వలన మృతిచెందారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 877కు చేరింది.
 
ఇప్పటిదాకా కరోనా నుండి 1,04,603 మంది కోలుకోగా శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 25,729 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు.
 
ఇక శుక్రవారం ఒక్కరోజే 62,132 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 16,67,653కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 305 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 184కేసులతో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments