Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:52 IST)
విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల నాలుగు నెలలుగా చెన్నైకు విమానాలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆచరణలో పెట్టడంతో, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైకు తొలి విమానం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌కు నాలుగేసి చొప్పున నడుస్తుండగా, వారంలో రెండు రోజులు ఢిల్లీకి ఒక విమానం నడుస్తుంది.

తాజా నిర్ణయంతో చెన్నైకు ఒక విమానంతోపాటు హైదరాబాద్‌కు అదనంగా మరో విమానానికి అవకాశం ఇవ్వడంతో విజయవాడ నుంచి నడిచే విమానాల సంఖ్య 11కు చేరింది. ఈ రెండు విమానాలు ఒకేరోజు ప్రారంభం కానున్నాయని ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments