Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:52 IST)
విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల నాలుగు నెలలుగా చెన్నైకు విమానాలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఆచరణలో పెట్టడంతో, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైకు తొలి విమానం ప్రారంభం కానుంది.

ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి తొమ్మిది విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌కు నాలుగేసి చొప్పున నడుస్తుండగా, వారంలో రెండు రోజులు ఢిల్లీకి ఒక విమానం నడుస్తుంది.

తాజా నిర్ణయంతో చెన్నైకు ఒక విమానంతోపాటు హైదరాబాద్‌కు అదనంగా మరో విమానానికి అవకాశం ఇవ్వడంతో విజయవాడ నుంచి నడిచే విమానాల సంఖ్య 11కు చేరింది. ఈ రెండు విమానాలు ఒకేరోజు ప్రారంభం కానున్నాయని ఎయిర్‌ పోర్టు అథారిటీ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments