Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం.. తణుకు ఎమ్మెల్యేకు పాజిటివ్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (14:15 IST)
Tanuku MLA
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. కరోనా మహమ్మారి అసెంబ్లీని కూడా తాకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయన రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇదే విషయం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఇదిలా ఉంటే తనకు కరోనా సోకినట్లు తేలడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వరరావు హాజరు కావడం లేదు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే, ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. కొత్తగా నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments