Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన వృద్ధ దంపతులకు వేధింపులే మిగిలాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (23:06 IST)
ఓ వైపు మనం పోరాడాల్సింది కరోనాతో.. కానీ, రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగులపై వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు హమీదా బీ కూడా కరోనాతో పోరాటం చేసి విజయం సాధించింది.. కానీ, ఆమె ఉండే ప్రాంతంలోని స్థానికుల వేధింపులు, బెదిరింపులు పెరిగిపోవడం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. అయితే.. అంబూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా మళ్లీ ఇంటికి చేరుకున్నారు. కానీ, చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు ఆమెను వింతగా చూడడం.. సూటిపోటి మాటలు కూడా అనడంతో ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
 
దాదాపు 15 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వృద్ధురాలికి కరోనా వచ్చిన తర్వాత ఇంటి యజమాని కూడా వేధింపులకు గురిచేశాడని.. వెంటనే ఖాళీ చేయాలంటూ వేధించసాగాడు.. ఒక ఇరుగుపొరుగువారి నుంచి కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆ వృద్ధురాలు వాపోయింది. 
 
కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో.. ఆమె ఇంటికి వచ్చిన స్థానిక అధికారి గాయత్రి సుబ్రమణి... హమీదా బీను ఓదార్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఫించన్ కూడా ఇస్తామని వెల్లడించి ధైర్యాన్ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments