Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన వృద్ధ దంపతులకు వేధింపులే మిగిలాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (23:06 IST)
ఓ వైపు మనం పోరాడాల్సింది కరోనాతో.. కానీ, రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగులపై వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు హమీదా బీ కూడా కరోనాతో పోరాటం చేసి విజయం సాధించింది.. కానీ, ఆమె ఉండే ప్రాంతంలోని స్థానికుల వేధింపులు, బెదిరింపులు పెరిగిపోవడం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. అయితే.. అంబూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా మళ్లీ ఇంటికి చేరుకున్నారు. కానీ, చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు ఆమెను వింతగా చూడడం.. సూటిపోటి మాటలు కూడా అనడంతో ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
 
దాదాపు 15 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వృద్ధురాలికి కరోనా వచ్చిన తర్వాత ఇంటి యజమాని కూడా వేధింపులకు గురిచేశాడని.. వెంటనే ఖాళీ చేయాలంటూ వేధించసాగాడు.. ఒక ఇరుగుపొరుగువారి నుంచి కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆ వృద్ధురాలు వాపోయింది. 
 
కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో.. ఆమె ఇంటికి వచ్చిన స్థానిక అధికారి గాయత్రి సుబ్రమణి... హమీదా బీను ఓదార్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఫించన్ కూడా ఇస్తామని వెల్లడించి ధైర్యాన్ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments