Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:18 IST)
గుంటూరులో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం మరిన్ని కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 327 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుంటూరు సిటీలో మాత్రం 185 కేసులు నమోదైనాయి. దీంతో జిల్లా కలెక్టర్. శామ్యూల్ ఆనంద కుమార్ నగరంలోని అనేక నివాస ప్రాంతాలతో కూడిన బ్రాడీపేట్, లక్ష్మీపురం, శ్రీనగర్ కాలనీ మరియు అమరావతి రోడ్డులోని అనేక ప్రాంతాలను కలిగి ఉన్న 14 కంటైన్మంట్ జోన్లను ప్రకటించారు.
 
బ్రాడీపేటలో 40 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోజులలో శుక్రవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని టోకు, రిటైల్ సంఘాలు ప్రకటించాయి. జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలతో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్, కరోనా రోగులను గుర్తించడానికి నిఘా బృందాలను సేవల్లోకి తీసుకువస్తామని చెప్పారు. 
 
అన్ని మండలాల్లో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇందులో భాగంగా 20 కేసులతో మంగళగిరి మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం.. చికిత్స అందించడం వంటివి జరుగుతున్నాయని.. కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఇంకా దుకాణాదారుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments