తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (11:12 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల నిబంధనలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతోంది. కంటెన్మైంట్ జోన్లలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచిస్తోంది. తాజాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార దుకాణాలు తెరిచి ఉంచాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. 
 
ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడు మంజునాథ్‌ మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూతవేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అలాగే వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెస్టుల సంఖ్య పెంచిన తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసులు సైతం భారీగానే నమోదవుతున్నాయి. మరోవైపు గత నెలలో శ్రీవారి ఆలయం తెరుచుకున్న తర్వాత చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా ప్రభావం తీవ్రమైంది. దీంతో తిరుపతిలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి.
 
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను మూసివేయాలని తిరుపతి వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాయి. కేవలం మెడికల్, వైద్య సంబంధిత షాపులు మాత్రమే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తెరిచి ఉంటాయని, ఇతరత్రా దుకాణాలు మూసివేయాలని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. తప్పనిసరి పనులుంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బటయకు రావాలని అధికారులు సైతం సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi : ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్ తో వచ్చారు : రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments