Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు
, శుక్రవారం, 10 జులై 2020 (11:18 IST)
గుంటూరులో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం మరిన్ని కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 327 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుంటూరు సిటీలో మాత్రం 185 కేసులు నమోదైనాయి. దీంతో జిల్లా కలెక్టర్. శామ్యూల్ ఆనంద కుమార్ నగరంలోని అనేక నివాస ప్రాంతాలతో కూడిన బ్రాడీపేట్, లక్ష్మీపురం, శ్రీనగర్ కాలనీ మరియు అమరావతి రోడ్డులోని అనేక ప్రాంతాలను కలిగి ఉన్న 14 కంటైన్మంట్ జోన్లను ప్రకటించారు.
 
బ్రాడీపేటలో 40 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోజులలో శుక్రవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని టోకు, రిటైల్ సంఘాలు ప్రకటించాయి. జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలతో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్, కరోనా రోగులను గుర్తించడానికి నిఘా బృందాలను సేవల్లోకి తీసుకువస్తామని చెప్పారు. 
 
అన్ని మండలాల్లో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇందులో భాగంగా 20 కేసులతో మంగళగిరి మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం.. చికిత్స అందించడం వంటివి జరుగుతున్నాయని.. కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఇంకా దుకాణాదారుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీం జగన్‌కు ప్రశంసలు, ఎందుకో తెలుసా?