Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే మహిళకు మూడు డోసుల వ్యాక్సిన్.. నిమిషాల వ్యవధిలో...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (16:20 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్య సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకే మహిళకు కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు కరోనా డోసులు వేశారు. మహారాష్ట్రలోని థానే సిటీలో ఆరోగ్య సిబ్బింది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్వేశారు. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగిగా ప‌ని చేస్తున్న వ్య‌క్తి భార్య‌కే ఇలా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు మ‌హిళ జ‌రిగిన ఘ‌ట‌న‌ను త‌న భ‌ర్త‌కు చెప్ప‌గా.. అత‌డు స్థానిక కార్పొరేట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. 

ఈ విష‌యంలో వెలుగులోకి రాగానే థానె మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌.. ఆ మ‌హిళ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి వైద్య బృందాన్ని ఇంటికి పంపించింది. త‌న భ‌ర్త టీఎంసీలో ప‌ని చేస్తాడ‌న్న ఉద్దేశంతో తాను ఫిర్యాదు చేయాల‌ని అనుకోలేద‌ని ఆ మ‌హిళ చెప్పింది. 

త‌న భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటుండ‌టం వ‌ల్ల ఈ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో త‌న‌కు తెలియ‌ద‌ని ఆమె భ‌ర్త చెప్పాడు. ఆమెకు ఆ రోజు జ్వరం వ‌చ్చింద‌ని, అయితే మ‌రుస‌టి రోజు త‌గ్గిపోయి అప్ప‌టి నుంచి బాగానే ఉన్న‌ద‌ని అన్నాడు. ఆమెను ప‌రీక్షించిన వైద్య బృందం కూడా ఆ మ‌హిళ ఆరోగ్యంగానే ఉన్న‌ద‌ని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments