Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైజర్‌పై షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్‌ తీసుకున్న నర్సు మృతి..!

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:48 IST)
కరోనా వ్యాక్సిన్లు ఆమోదం పొందుతున్నాయని, తర్వలోనే మహమ్మారి నుంచి బయటపడతామని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇదో షాకింగ్ వార్తే. ఎందుకంటే? కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాన్మరణం చెందారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల్లో నర్సు చనిపోయినట్లు సమాచారం. ఎన్నో ప్రమాణాలతో తయారుచేసిన వ్యాక్సిన్లు వికటిస్తున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 
 
సోనియా ఏస్‌వెడో అనే 41ఏళ్ల పోర్చుగీసు నర్సు నూతన సంవత్సరం తొలిరోజు అకస్మాత్తుగా చనిపోయింది. అంతకు 48 గంటల ముందు ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా (పైజర్ వ్యాక్సిన్)ను ఆమె తీసుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న నర్సు చనిపోవడంతో వ్యాక్సిన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 
పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్‌లో సోనియా విధులు నిర్వహించేవారు. ఆమెకు సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెల్త్ వర్కర్ అయిన సోనియా డిసెంబర్ 30న ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా తీసుకున్నారు. 
 
తన తల్లి మరణంపై కారణాలు తెలియాలంటూ చనిపోయిన నర్సు సోనియా కుమార్తె అబిలియో ఏస్‌వెడో ఉన్నతాధికారులను కోరారు. విచారణ జరిపించి నిజనిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద పనిచేస్తున్న నర్సు సోనియా చనిపోవడంపై పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments