భారత్‌లో కరోనా విలయతాండవం.. 4లక్షలతో రికార్డ్.. ఒక్కరోజే 3,464 మంది మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (10:08 IST)
భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో నిత్యం రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 
 
తాజాగా .. గడిచిన 24 గంటల్లో 19,45,299 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 4,08,323 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,63,488కి చేరింది.
 
నిన్న ఒక్క రోజే 3,464 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,11,778కి చేరింది. నిన్న 2,97,488 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,56,71,536 కి చేరింది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

MM Srilekha: టైమ్ ట్రావెలింగ్ కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది : ఎంఎం శ్రీలేఖ

Vijayendra Prasad: పవన్ మహావీర్ హీరోగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం

singer Smita: ఓజి× మసక మసక సాంగ్ అందరినీ అలరిస్తుంది : పాప్ సింగర్ స్మిత

Sobhan Babu: నేటి టెక్నాలజీ తో శోభన్ బాబు- సోగ్గాడు రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments