Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కలుషితం.. సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత

Webdunia
శనివారం, 1 మే 2021 (09:46 IST)
fish
లెబనాన్‌లోని లిటానీ నదిలో నీళ్లు కలుషితం కావడం వల్ల సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లో అతి పెద్ద నది అయిన లిటానీ కలుషితమవుతోందని ఎన్నో ఏళ్లుగా అక్కడి పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, ఫ్యాక్టరీల వ్యర్థాలను నదిలోకి వదులుతుండటం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితమైపోయాయి.
 
కొన్ని రోజుల కిందటి నుంచే చేపలు నదిపైన తేలడం ప్రారంభమైందని, కొన్ని టన్నుల కొద్దీ ఇలా మృత్యవాత పడటం చాలా బాధాకరమని స్థానిక పర్యావరణ కార్యకర్త అహ్మద్ అస్కర్ చెప్పారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 టన్నుల చేపలు మృత్యువాత పడటం అసాధారణమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నది కలుషితం కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
 
నదిలో చేపలు పూర్తిగా విషపూరితమయ్యాయని, వాటిలో వైరస్ ఉన్నందు వల్ల చేపల వేటకు వెళ్లొద్దని 2018లోనే మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్ గతేడాది బీరుట్‌లో జరిగిన పేలుడు కారణంగా మరింత కుంగిపోయింది. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన సవాళ్లు కూడా ఆ దేశానికి ఎదురవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments