Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కలుషితం.. సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత

Webdunia
శనివారం, 1 మే 2021 (09:46 IST)
fish
లెబనాన్‌లోని లిటానీ నదిలో నీళ్లు కలుషితం కావడం వల్ల సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లో అతి పెద్ద నది అయిన లిటానీ కలుషితమవుతోందని ఎన్నో ఏళ్లుగా అక్కడి పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, ఫ్యాక్టరీల వ్యర్థాలను నదిలోకి వదులుతుండటం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితమైపోయాయి.
 
కొన్ని రోజుల కిందటి నుంచే చేపలు నదిపైన తేలడం ప్రారంభమైందని, కొన్ని టన్నుల కొద్దీ ఇలా మృత్యవాత పడటం చాలా బాధాకరమని స్థానిక పర్యావరణ కార్యకర్త అహ్మద్ అస్కర్ చెప్పారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 టన్నుల చేపలు మృత్యువాత పడటం అసాధారణమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నది కలుషితం కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
 
నదిలో చేపలు పూర్తిగా విషపూరితమయ్యాయని, వాటిలో వైరస్ ఉన్నందు వల్ల చేపల వేటకు వెళ్లొద్దని 2018లోనే మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్ గతేడాది బీరుట్‌లో జరిగిన పేలుడు కారణంగా మరింత కుంగిపోయింది. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన సవాళ్లు కూడా ఆ దేశానికి ఎదురవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments